షీ టీం ద్వారా విద్యార్థినిలకు అవగాహన
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్సువాడ ప్రతినిధి: బాన్సువాడ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ విద్యార్థులకు బాన్స్ వాడ షీ టీమ్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం స్వీయ రక్షణ పై అవగాహన కల్పించారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళే టప్పుడు అపరిచిత వ్యక్తులు పలకరిస్తే గాని తినుబండారాలు ఇస్తే తీసుకోకూడదని సూచించారు. చిన్నారులపై అగాయిత్యాలు పెరిగి పోతున్నాయని మీకు తెలియని అపరిచితులు చెప్పిన మాటలు వినకూడదని, మీకు ఇబ్బందులు కలిగిస్తే మీ పాఠశాల అధ్యాపకులకు, లేదా మీ తల్లిదండ్రుకు సమాచారం అందజేయాలని, తిను బండారాలు, వస్తువులు ఇస్తే తీసుకోకూడదని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమం లోషీ టీమ్ కానిస్టేబుల్, ఆచార్యులు, విద్యా ర్థులు తదితరులు పాల్గొన్నారు.