మంత్రి ఎర్రబెల్లిని కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. తన గెలుపు కోసం అవిరామ కృషి చేసినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే లు శ్రీ ఆరూరి రమేష్, శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.