మునుగోడు లో నిబంధనలు కఠినం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు ఎన్నికల కోడ్ ప్రకటించినందున నిబంధనలు కఠిన తరం చేసినట్లు  దేవరకొండ కమిషనర్ వెంకటయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉదయం నుండి బస్టాండ్ జూనియర్ కళాశాల మీనాక్షి సెంటర్ పాత పెట్రోల్ బంక్ అంబేద్కర్ చౌరస్తాలో వద్ద ఏర్పాటుచేసిన పార్టీ వ్యక్తిగత ఫ్లెక్సీలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించి ప్లెక్సీలను ఏర్పాటు చేసిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.