మునుగోడులో ఓటరు నమోదుకు నేడే చివరి రోజు

మునుగోడు నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి మంగళవారం (నేడు) చివరి తేదీ అని సంబంధిత అధికారులు తెలిపారు. 2004 జనవరి 01 వ తేదీకంటే ముందు జన్మించిన, 18 ఏళ్ళు నిండిన యువతి యువకులు పదవ తరగతి మెమో, స్థానిక చిరునామాతో కలిగిన ఆధార్ కార్డ్/వంట గ్యాస్ బిల్/కరెంట్ బిల్లుతో మీ సేవా, ఆన్లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గత నెల సెప్టెంబర్ 30వ తేదీ వరకు 20, 181 మంది కొత్త ఓటరుగా చేరేందుకు దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.