బెయిల్‌ మంజూరు పై ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసిన సీబీఐ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ మద్యం కేసు లో సీబీఐ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. అభిషేక్ బోయినపల్లివిజయ్ నాయర్‌లకు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ పిటిషన్‌పై స్పందించాలని అభిషేక్ బోయినపల్లివిజయ్ నాయర్‌లకు నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణం వ్యవహారంలో విచారణకు సహకరించలేదని అభిషేక్ బోయినపల్లివిజయ్ నాయర్‌లను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కస్టడీలో విచారణ అనంతరం 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ తర్వాత ఈ నెల 21న ఇరువురికి రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిలు మంజూరు చేసింది. ప్రత్యేక కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సీబీఐ ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.