భారత సైన్యానికి క్షమాపణలు చెప్పిన నటి రిచా చద్దా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గాల్వాన్ ఘటనపై బాలీవుడ్ నటి రిచా చద్దా తాజాగా చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఆమెపై సోషల్ మీడియాలో నెటిజెన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిచా ట్వీట్ భారతీయ ఆర్మీని చాలా చులకన చేసినట్లు ఉందని, భారత జవాన్ల త్యాగాలను తక్కువ చేసేదిలా ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో రిచా తాజాగా దించింది.ఉద్దేశపూర్వకంగా ఈ ట్వీట్ చేయలేదని తెలిపింది. ఈ మేరకు భారత సైన్యానికి క్షమాపణలు చెప్పింది. ‘ఎవ్వరినీ నొప్పించే ఉద్దేశం నాకు లేదు. నా ట్వీట్ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి. మాది కూడా సైనిక కుటుంబమే. గతంలో మా తాత లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సైన్యంలో పని చేశాడు’ అంటూ ట్వీట్ చేసింది.ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ను చేజిక్కించుకునేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఆ ప్రకటనపై రిచా స్పందిస్తూ.. ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అంటూ కామెంట్ చేసింది. ఆ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో నటి దిగొచ్చి క్షమాపణలు చెప్పింది.