రాష్ట్ర విద్యా మహా సభల పోస్టర్ ఆవిష్కరించిన MEO నాగేశ్వరరావు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర విద్యా మహాసభల పోస్టర్ ను మండల వనరుల కేంద్రంలో విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా SCST ఉపాద్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యల సంతోష్ SCST ఉపాద్యాయ సంఘం రాష్ట శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 10,11 తేదీలలో రెండు రోజులపాటు, వికారాబాద్ లో జరిగే రెండవ రాష్ట్ర విద్యా మహాసభలను విజయవంతం చేయడానికి కామారెడ్డి జిల్లాకు చెందిన SCST ఉపాద్యాయులు అధిక సంఖ్యలో ఉపాద్యాయులు జిల్లా తరుపున వేల సంఖ్యలో హాజరుకాబోతున్నారని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన నీకోసం జరిగే హక్కుల పోరాటంలో నీవు పాల్గొనకపోతే నీ బానిసత్వానికి నీవే కారణం అవుతావు అన్న మాటలని స్ఫూర్తిగా తీసుకుని ఉపాద్యాయులందరు అధిక సంఖ్యలో పాల్గొని SCST ఉపాద్యాయుల ఐక్యత చాటాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ మండల అధ్యక్షుడు లక్యా ,ప్రదాన కార్యదర్శి గోపి,రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, గణపతి,హరిసింగ్,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.