బాన్సువాడ మండలంలో కొనసాగుతున్న భాజపా ఆత్మీయ సమ్మేళనం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ మండలంలోని ఆయా గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు మాల్యాద్రి రెడ్డి బిజెపి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 8 గం.లకు కోనాపూర్, 10 గం..లకు, గోపాల్ తండా, 11 గం..లకు కదలాపూర్, మధ్యాహ్నం 1 గం..లకు సంగ్రామ్ తాండ, ,శత్రునాయక్ తండా, 6 గం..లకు సంగోజీ పెట్ గ్రామాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్బంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపేట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ మాల్యాద్రి ముందుకు సాగుతున్నారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.