బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. భైంసాకు 3 కి.మీ దూరంలో సభ ఉంటేనే అనుమతించాలని హైకోర్టు తెలిపింది. భైంసాలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని సూచించింది. విద్వేషపూరిత వ్యాఖ్యలు, నినాదాలు చేయొద్దని చెప్పింది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టేందుకు సంజయ్ వెళ్తుండగా జగిత్యాల జిల్లా కోరుట్ల వద్ద పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.