ఉచిత అంబులెన్స్ సేవలందిస్తున్న మదన్ మోహన్ రావు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టిపిసిసి ఐటి సెల్ ఛైర్మెన్ మదన్ మోహన్ రావ్ ప్రజల సౌకర్యార్థం అంబులెన్స్ ఉచిత సేవలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎల్లారెడ్డి మండలం, మీసానిపల్లీ గ్రామానికి చెందిన అశ్విని గర్భవతి కాగా నొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు వారి కుటుంబీకులు మదన్ మోహన్ అంబులెన్స్ కు ఫోన్ చేయడంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిదంగా నిజాంసాగర్ మండలం హాసన్ పల్లి గ్రామానికి చెందిన సుశీల శ్వాశ తీసుకోవటం ఇబ్బంది పడుతుండటంతో మదన్ మోహన్ ట్రస్ట్ సభ్యులు సకాలంలో స్పందించి ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్ అందజేశారు. ఈ సందర్బంగా సేవలు పొందుతున్న ప్రజలు మదన్ మోహనరావు కు ప్రతీక కృతఙ్ఞతలు తెలియజేశారు.