తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఘంటసాలకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న‘ ప్రకటించాలని పలువురు వక్తలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఘంటసాల శత జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆది లీల ఫౌండేషన్, మాతృ దేవోభవ సత్సంగ్, గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ,సాయిసి, సాయి భక్తుల సంయుక్త ఆధ్వర్యంలో గన్ ఫౌండ్రి సూర్యలోక్ కాంప్లెక్స్లో గల పీపుల్స్ ఎడ్యూకేషన్ ట్రస్ట్ ఆడిటోరియంలో ఘంటసాల గానవధానం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఆది లీల ఫౌండేషన్ చర్మెన్ ఆదినారాయణ మాట్లాడుతూ ఘంటసాలతన తన మధురమైన గొంతు తో యావత్ ప్రపంచ ప్రజలను మంత్రం ముగ్ధులను చేసారు అలాంతి మహోన్నత వ్యక్తీ కి‘భారతరత్న‘ ఇవ్వడం సముచితమన్నారు., . కవి, గాయకుడు డాక్టర్ సయ్యద్ రహ్మతుల్లా ఘంటసాల గానవ ధానం చేశారు. న్యాయవాది హేమచలం అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మాతృదేవోభవ సత్సంగ్ అధ్య క్షుడు కేబీ శ్రీధర్, సాయి సి అధ్యక్షుడు కేఎన్ఎన్ రాజు, సంఘసేవకులు సుధాకర్, పలు సంస్థల ప్రతినిధులు తుపాకుల సమత, అరుణ, నేతాజీ తదితరులు హాజరయ్యారు.