ట్విట్టర్ లో బిజెపిపై నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిజామాబాద్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బిజెపి పార్టీపై నిప్పులు చెరిగారు. ట్విట్టర్ ద్వారా ఆమె మండిపడ్డారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటన బీజేపీ ని గడగడలాడించిందని, బిజెపి చౌకబారు ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టి తగిన గుణపాఠం చెబుతారన్నారు. విద్వేషాన్ని ప్రోత్సహించడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రయత్నం చేయడం వంటివి టీఆర్ఎస్ సైన్యం వద్ద పనిచేయవని హితవు పలికారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు తాము, తమ పార్టీ కట్టుబడి ఉందని, తెలంగాణ ప్రజలకు సేవ చేయడాన్ని మమ్మల్ని ఏ శక్తి ఆపలేదన్న విషయాన్ని బిజెపి మరోసారి గురుంచుకోవాలన్నారు.