చెత్త బుట్టలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని 19, వ వార్డులో వార్డు ప్రజలకు బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తడి పొడి చెత్త పై అవగాహన కల్పించడం కాకుండా వారికి చేతబెట్టాలను గురువారం పంపిణీ చేశారు. ప్రజలు బాన్సువాడ పట్టణంలో పారిశుద్ధ్య నిర్మూలనకు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమేష్, పట్టణ మైనారిటీ సెక్రెటరీ యండి. దావూద్, స్థానిక వార్డు కౌన్సిలర్ అహ్మద్, వార్డు స్పెషల్ ఆఫీసర్ సుధీర్, శానిటరీ ఇన్స్పెక్టర్ హన్మాండ్లు, ఆర్పీ వినోద తదితరులు పాల్గొన్నారు.