4న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్స్ వాడ ప్రతినిధి: బాన్స్ వాడ పట్టణంలోని కోటగల్లి గుట్ట పైన గల శ్రీ వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఈ నెల 4వ తేదీ ఆదివారం రోజున శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గురజాల గంగామణి పాండుచారి గురువారం తెలిపారు. తన కుటుంబం సపరివార సమేతంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు,పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘము ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలనీ కోరారు. ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ్యులు, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేయుచున్నారని వారు తెలిపారు. ఆదివారం ఉదయం 6.05ని,,నుండి గణపతి పూజ, అభిషేకం,పుణ్య హవచనం, 11.15ని,,శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల కళ్యాణం, 11.05ని,, లకు హోమము,గోమాత పూజా, 1గ,, మహా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.కళ్యాణంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబ నూతన ఉత్సవ విగ్రహాలను ఆలయానికి కుటుంబ సభ్యుల సమేతంగా అందజేయడం జరుగుతుందన్నారు.ఇట్టి కళ్యాణమహోత్సవంలో పట్టణ ప్రజలు విశ్వబ్రాహ్మణ సంఘము,విశ్వకర్మలు, పురప్రముఖులు,భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహేంద్ర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.