పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి తీసుకొచ్చారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి తీసుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు పోలవరాన్ని గోదావరిలో కలిపేసారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ మాటలకుచేష్టలకు పొంతన ఉండదని తప్పుబట్టారు. జగన్‌రెడ్డి పాలనలో ఒక్కరికైనా జాబు వచ్చిందాఅని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి వచ్చాక ఏపీ నుంచి పెట్టుబడులన్నీ తరలివెళ్తున్నాయని తెలిపారు. యువతకు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జగన్‌రెడ్డి పాలనలో ఇసుకమద్యంఖనిజాల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పేదలకు ఇప్పటికీ ఇవ్వడంలేదన్నారు. పేదలకు 30 లక్షల ఇళ్లు కట్టి ఇస్తామన్న జగన్‌రెడ్డి హామీ ఏమైందిఅని ప్రశ్నించారు. మద్యపాన నిషేధమంటూ జేబ్రాండ్లు తీసుకొచ్చారనికల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.