ఈడీ పరిధిలోకి మరో 15 సంస్థలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ)ను కేంద్రం మరింత శక్తివంతం చేసింది. మరో 15 సంస్థలను ఈడీ పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పీఎంఎల్‌ఏ చట్టంలోని 66వ నిబంధనలో కేంద్రం మార్పులు చేసింది. రాష్ట్ర పోలీసు విభాగాలను కూడా ఈడీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఈడీ కోరిన ఏ సమాచారాన్నైనా ఇవ్వాల్సిందేనంటూ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. విదేశాంగశాఖఎన్‌ఐఏతో పాటు 15 కేంద్ర మంత్రిత్వ శాఖలను ఈడీ పరిధిలోకి తీసుకువస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.