బాన్సువాడ నుండి శబరిమలకు ప్రత్యేక బస్సులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ డిపో నుండి శబరిమలై వెళ్లే భక్తుల కొరకు ప్రత్యేక బస్సులు అద్దెకు ఇవ్వబడునని బాన్సువాడ డిపో మేనేజర్ సదాశివ్ గారు శనివారం ప్రకటనలో తెలిపారు బస్సు బుక్ చేసుకున్న వారికి 10 శాతం రాయితీ కల్పిస్తామన్నారు శబరిమల లో దర్శనం కూడా ఆర్టీసీ వారిచే చేయించబడును అన్నారు ఆర్టీసీ బస్సులను శబరిమల యాత్రకు బుక్ చేసుకొని మధ్య మధ్యలో వివిధ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవచ్చని అన్నారు సీట్లకు అదనంగా ఇద్దరు వంట మనుషులు ఇద్దరు మణికంఠలు ఒక గురుస్వామి ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉందని అన్నారు వివాహాలకు శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు అద్దెకిస్తామని తెలియజేశారు ప్రయాణికులందరూ ఆర్టీసీలో ప్రయాణించి ఆర్టీసీని ఆదరించగలరని తెలియజేశారు బాన్సువాడ డిపో మేనేజర్ సదాశివ్  9959226020 అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తి  7382851280 తెలియచేశారు

Leave A Reply

Your email address will not be published.