తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుగా మార్చిన ఘనత కేసీఆర్ దే

.. రాంపూర్ లో ఎంపీ బండి సంజయ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం లోని రాంపూర్ గ్రామంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన బండి రాంపూర్ లో అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయా? కెసిఆర్ కి మళ్ళీ ఒకసారి ఓటు వేస్తారా? మనం రోడ్లమీద తిరుగుతుంటే… ఈ సమయానికి కేసీఆర్ 6 పెగ్గులు వేసి ఉంటాడన్నారు. పాదయాత్రలో మేము ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి, మాకు ఘనస్వాగతం పలుకుతున్నారన్నారు. మనం కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, రాంపూర్ కి మిషన్ భగీరథ నీళ్లు కూడా ఇవ్వడం లేదు, ఇక్కడ తాగునీరు అంతా కూడా మురుగు నీరే వస్తుందన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదు, దళితులకు 3 ఎకరాలు, దళిత బంధు ఇవ్వలేదు, ఎంతసేపు రాంపూర్ వాళ్ళ కొంప ముంచాలనే కేసీఆర్ చూస్తాడు. తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుగా మార్చిండు పుట్టబోయే బిడ్డ నెత్తి పై కూడా లక్ష రూపాయలు అప్పు పెట్టిండు అన్నారు. ఢిల్లీలో కేసీఆర్ కూతురు లిక్కర్ దందా చేసింది రాంపూర్ గ్రామంలో గుడి, బడి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేకపోయినా… కేసీఆర్ షాపులు మాత్రం 10, 15 వరకు ఉంటున్నాయి. తెలంగాణ సొమ్ము దోచుకుని కేసీఆర్ కూతురు ఢిల్లీలో లిక్కర్ దందా చేస్తోంది. లంగ దండాలు..దొంగ దందాలు అన్నీ కెసిఆర్ కుటుంబానివే అన్నారు. 1400 మంది పేదోళ్ల ఆత్మబలి దానాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, కెసిఆర్ అనే మూర్ఖుడి చేతిలో పెట్టినాం కెసిఆర్ కుటుంబం పాలించడానికి మనం తెలంగాణ రాష్ట్రం సాధించామా? కెసిఆర్ కూతురు లంగ దందా.. దొంగ దందా చేస్తే, కవితపై కేసు పెట్టదంట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిండా ముంచిండు, తెలంగాణకు రెండు లక్షల 40వేల ఇండ్లను మోడీ మంజూరు చేశారు. మోడీ మంజూరు చేసిన ఇండ్లను కూడా కేసీఆర్ కట్టించడం లేదని తెలిపారు. టిఆర్ఎస్ నేతలకు కబ్జాలు చేయడం తప్ప, అభివృద్ధి చేయడం తెలియదు ధరణి పోర్టల్ పేరుతో పేదోళ్ల జాగాలను గుంజుకుంటున్నారు, హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయల విలువ చేసే జాగాలను కబ్జా చేసేందుకే ధరణి పోర్టల్ తెచ్చిండు, కెసిఆర్ మోసపూరిత మాటలను నమ్మొద్దన్నారు. నేను చెప్పే వివరాలు తప్పైతే… నాపై కేసు పెట్టండి ఉచిత బియ్యం మోడీ ఇస్తుంటే… రేషన్ షాపుల వద్ద కేసీఆర్ తన ఫోటో పెట్టుకుంటున్నాడు, కిలోకు 29 రూపాయలు భరిస్తున్న కేంద్ర ప్రభుత్వం గొప్పదా…? రూపాయి వసూలు చేస్తున్న కేసీఆర్ గొప్పోడా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. చివరికి బాత్రూంల వద్ద కూడా కేసీఆర్ తన ఫోటో పెట్టించుకుంటున్నాడు, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే కెసిఆర్ కు టీఆర్ఎస్ నేతలకు మోడీని తిట్టడం తప్ప, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాదు. కెసిఆర్ గడీలను బద్దలు కొట్టాలి ఇప్పుడు ఎన్నికలు లేవు… నేను ఓట్ల కోసం రాలేదు నేను ఇక్కడ పోటీ చేసే వాడిని కాను కుటుంబాలను వదులుకొని మీకోసమే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నాం పేదోళ్ల రాజ్యం రావాలి… మీ బతుకులు బాగుపడాలి మీ కోసం కొట్లాడుతాం… మీ కోసం ఉద్యమిస్తాం రామరాజ్యం రావాలి అని ఆకాంక్షించారు. అనంతరం బండి సంజయ్ సమక్షంలో బిజెపిలో చేరిన పలువురు టిఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరగా వారికి కాషాయ కండువా కప్పి, పార్టీలోకి  ఘనంగా ఆహ్వానించారు.

Leave A Reply

Your email address will not be published.