దర్జాగా నిజాంసాగర్ ఉపకాలువా కబ్జా

.. పట్టించుకోని అధికారులు .. అన్యక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూమి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: నసురుల్లాబాద్ గ్రామ శివారులో గల నిజాంసాగర్ ప్రధాన కల్వకు అనుసంధానంగా ఉన్న ఉప కాలువ కబ్జాకు గురవుతుంది. ఉపకాల్వను అనుకొని ఉన్న పంట పొలాల యజమానులు కాలువ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ట్రాక్టర్ల ద్వారా దున్నుకుంటూ అట్టి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజులలో ఉపకాలవ కనిపించకుండా పోతుందేమోనన్న అనుమానాన్ని గ్రామ శివారులోని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కాలువకు సంబంధించిన భూమిని కబ్జాకు గురి చేస్తున్న వారిపై తగు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.