లక్ష కోట్లతో కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా

-నీ బిడ్డ ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా? -సారా స్కాంలో అరెస్ట్ చేస్తే తెలంగాణ అంతా ఎందుకు ధర్నా చేయాలే?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేసీఆర్ నిన్ను నమ్మి నీకు అధికారమిస్తే తెలంగాణ ప్రజలకు చిప్పచేతికిస్తవా? మీ కుటుంబం లెక్క లిక్కర్, గ్రానైట్, క్యాసినో, డ్రగ్స్ దందా నేను చేయలేదని, డేదేశం, ధర్మం కోసం జైలుకు వెళ్లిన చరిత్ర తనదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ అన్నారు. నిజాయితీగా పనిచేసే వ్యాపారస్తులు, సామాన్యలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేసిందా?లంగ దందాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న వారిపై విచారణ సంస్థలు దాడి చేయాలా? వద్దా అని ప్రశ్నించారు. వ్యవస్థలన్నీ ధ్వంసం చేసిన దుర్మార్గుడు, ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని మోసగాడు, ట్రిపుల్ ఐటీసహా విద్యా వ్యవస్థను నీరుగార్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఇక్కడి మంత్రి అవినీతి తిమింగలం, 2 వేల ఎకరాలు దోచుకుని వేలకోట్లు సంపాదించిన కబ్జాకోర్, ఈ అల్లకల్లోల అవినీతి మంత్రి అంతు చూస్తామని బండి హెచ్చరించారు.

కేసీఆర్…. నీ బిడ్డ ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా? ఝాన్సీ లక్ష్మీబాయినా? ప్రజల సొమ్ముతో లక్ష కోట్ల సారా (లిక్కర్) దందా చేసింది. అట్లాంటామెను అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలెందుకు ధర్నా చేయాలె?’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా అల్లకల్లోల మంత్రి అవినీతి వేలాది ఎకరాలను కబ్జా చేసి వేల కోట్లు దోచుకున్న తిమింగలంలా మారారని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో 40 శాతం ఒక వర్గానికే కేటాయిస్తే 80 శాతం జనాభా ఉన్న హిందువుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఊరుకోబోనని, హిందువులను మోసం చేసి దాడులు చేస్తే నిర్మల్ కు వచ్చి ఒక్కొక్కరిని బట్టలూడదీసి తరిమితరమి కొడతామని హెచ్చరించారు. అవినీతి అనకొండ కేసీఆర్ కుటుంబంతోపాటు అవినీతి తిమింగల అల్లకల్లోల మంత్రిని సైతం వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఊచలు లెక్క పెట్టిస్తామని ప్రకటిస్తారు. నిర్మల్ లో ప్రభుత్వ భూములనే సాకుతో శాంతి నగర్ లో పేదల ఇండ్లను కూల్చేసిన అధికారులు…. అవే ప్రభుత్వ భూముల్లో బడా బాబుల విల్లాలను ఎందుకు కూల్చివేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిర్మల్ కు బుల్డోజర్లను పంపి బడా బాబుల ఇండ్లను కూల్చివేయిస్తామని హెచ్చరించారు. లవ్ జిహాదీల పేరుతో హిందూ అమ్మాయిలను వేధించే లుచ్చా నాకొడుకుల బట్టలూడదీయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హిందూ అమ్మాయి శ్రద్దావాకర్ ను 36 ముక్కలు చేయడంతోపాటు 20 మంది అమ్మాయిలను మోసం చేసిన ఆ అప్తాబ్ విషయంలో లౌకిక శక్తుల నోళ్లు ఎందుకు మూతపడ్డాయని బండి సంజయ్ ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.