కెసిఆర్ కు కండకావరం తలకెక్కింది

.. త్వరలోనే దించేస్తామన్న బండి సంజయ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కండకావరం ఎక్కువైందని త్వరలోనే దాన్ని దించేస్తామని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.

నిర్మల్ పట్టణంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం చౌరస్తా హాజరైన భారీ జన సందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగ పాఠం వివరాలు…

ప్రజా సంగ్రామ యాత్రలో నేను నడుస్తున్నా… నన్ను నడిపిస్తున్నది మాత్రం పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి నే

మీలో జోష్ చూసిన తర్వాత, నిర్మల్ సంగతేందో చూద్దామనిపిస్తుంది

బిజెపి కార్యకర్తలు దమ్మేంటో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలీదా? అని ప్రశ్నించారు.

టైం, డేట్, ప్లేస్ చెప్పి మరీ… పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభ జరిపి, మనమేంటో చూపించాం

బైంసా(మహిషా) మనదే

పచ్చ(ఎంఐఎం) జెండాకు ఎక్కడా ఎగిరే అవకాశమే ఇవ్వం బిడ్డా

రానున్న రోజుల్లో తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అన్నారు.

కేసీఆర్ బిడ్డ లక్ష కోట్లు పెట్టి, ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది కేసీఆర్ బిడ్డ కవితను అరెస్టు చేయాల్నా…? వద్దా? అన్నారు.

బిడ్డకు నోటీస్ రాగానే… trs కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా టైర్లు కాలబెట్టాలి అంట కచ్చితంగా కేసీఆర్ కుటుంబానికి చిప్ప కూడు తప్పదు అన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా తెచ్చిన 317 జీవో కు వ్యతిరేకంగా పోరాడి జైలుకి వెళ్లిన దందాలు చేసి బండి సంజయ్ జైలుకు పోలేదు దేశం కోసం, ధర్మం కోసం, నా హిందూ సమాజం కోసమే జైలుకుపోయిన అన్నారు. లక్ష కోట్లు పెట్టి దొంగ దందా చేశారు కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేస్తారంటే… మళ్లీ ఉద్యమం చేయాలంట? కేసీఆర్ కు సిగ్గుండాలన్నారు. కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతిపరులను జైళ్లకు పంపే ప్రభుత్వమే… నరేంద్ర మోడీ ప్రభుత్వం నిజాయితీగా పనిచేసే ఏ ఒక్క వ్యాపారస్తులపైన అయినా సిబిఐ, ఈడి దాడులు జరిగాయా అని ప్రశ్నించారు.. లంగ దందాలు, దొంగ దందాలు చేసి, అవినీతికి పాల్పడే వాళ్లపై దాడులు చేయాలా… వద్దా? పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా… ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రను అడ్డుకునేందుకు పర్మిషన్ల పేరుతో ఇబ్బంది పెడుతుంటే… కోర్టు ద్వారా అనుమతి తీసుకుని పాదయాత్ర చేస్తున్నాం అన్నారు. కోర్టుల ద్వారా అనుమతి తీసుకుని పాదయాత్ర చేస్తున్నామంటే… ప్రజాస్వామ్యం ఏ విధంగా ఖూనీ అవుతుందో ప్రజలు ఒకసారి గమనించాలి, గడీల పాలనను అంతం చేయడానికి బిజెపి ముందుకొచ్చింది నమ్మి రాష్ట్రాన్ని అప్పజెప్పితే రాష్ట్రాన్ని దివాళా తీసి, ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్ అన్నారు. రైతుబంధు పేరుతో రైతులకు రావాల్సిన అన్ని సబ్సిడీలను ఎత్తేశాడు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నాడు. విద్యార్థులకు పొమ్మనలేక పొగ పెడుతున్నాడు, స్కావెంజర్లను తీసేసిండు, రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పులకుప్పగా మార్చిండన్నారు.

ఈరోజు 4వ తారీఖు వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి

పుట్టబోయే బిడ్డ నెత్తిపైనా లక్ష రూపాయల అప్పు పెట్టిండు

కేంద్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లాకు వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద భారీ ఎత్తున నిధులను మంజూరు చేసింది

ఈ ప్రాంతంలో ఉన్న ‘అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల’ ప్రాజెక్టు పేరును మార్చి, కాళేశ్వరం ప్రాజెక్టు పేరును తెరమీదకు తెచ్చిండన్నారు.

అంబేద్కర్ పేరు ఇష్టం లేకనే ఆ ప్రాజెక్టు పేరును మార్చిండు

వరదలకు కాళేశ్వరం పంపులను ముంచి, 1000 కోట్లు నష్టం తెచ్చిండు

ఇక్కడి కంత్రి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంగతి పక్కా చూస్తాం అన్నారు.

నీ అవినీతి సొమ్మును పక్కా కక్కిస్తాం,

ఇక్కడ భూములు, చెరువులను కబ్జా చేసింది ఎవరో మీకు తెలుసునన్నారు.

జనవరి 10 లోపు మున్సిపల్ కార్మికుల దగ్గర తీసుకున్న డబ్బులను.. వాళ్లకి తిరిగి ఇవ్వకపోతే… బిజెపి చేసే పోరాటాన్ని మీరు తట్టుకోలేరన్నారు.

ఇక్కడ దళిత బంధు, మూడు ఎకరాల భూమి, పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి లంచం కింద పైసలు ఇవ్వాల్సిందేనా?

40% డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆ ఒక్క వర్గానికే ఎందుకు ఇస్తున్నారు?

80% ఉన్న హిందువులకు ఎందుకు ఆపుతున్నారు?

ఆ ఒక్క వర్గానికి 40% ఇండ్లు ఇస్తారా?

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద తెలంగాణకు మోడీ 2,40,000 ఇండ్లను మంజూరు చేశారు.

ధర్మం కోసం పనిచేసే సైకోను తానని బండి పేర్కొన్నారు.

పేదలకు ఇవ్వకుండా ఎవడికైతే డబుల్ బెడ్ రూములు ఇచ్చారో… పక్కా మా ప్రభుత్వం వచ్చాక, వాటిని స్వాధీనం చేసుకుని, పేదలకు పంచుతాం

ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. ఇక్కడికి బుల్డోజర్ పట్టుకొస్తాను

తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని బుల్డోజర్లు కావాలో… ఇక్కడ కంత్రి మంత్రి చేసిన కబ్జాలకు అన్ని బుల్డోజర్ కావాలి

మినీ స్టేడియంలో ఎవ్వడైనా ఒక్క గజం జాగా కబ్జా చేస్తే… పక్కా వీపి పగలగొడతాం అన్నారు.

ఈ వర్గం, ఆ వర్గం అన్న తేడా లేకుండా … స్వచ్ఛ భారత్ మిషన్ కింద, రైతు సమ్మాన్ నిధి కింద అందరికీ సమానంగా ఇస్తున్నాం

బీహార్ లో 12% ఉన్న ముస్లిం(ఎంఐఎం పార్టీ)లకు… అక్కడ 4 అసెంబ్లీ స్థానాలు ఎలా వచ్చాయి?

మరి 80% ఉన్న హిందువులంతా ఏకమైతే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమా?

లవ్ జిహాద్’ పేరుతో… ఎవరైతే నా హిందూ అమ్మాయిలను వేధిస్తే.. వారి అంతు చూస్తాం

మహిళలను కాపాడేది బిజెపి ప్రభుత్వమే

కేరళలో క్రైస్తవ అమ్మాయిలను ఎత్తుకెళ్లి, లవ్ జిహాద్ పేరుతో చంపుతుంటే… క్రైస్తవ సంఘాలు మాట్లాడకుండా ఎక్కడికి పోయాయి?

త్రిబుల్ తలాక్ పేరుతో ముస్లిం మహిళలకు విడాకులు ఇస్తుంటే… ముస్లిం సంఘాలు మాట్లాడకుండా ఎక్కడికి పోయాయి?

ఢిల్లీలో శ్రద్ధా కపూర్ ను 34 ముక్కలు చేసి చంపింది ఎవడో మీకు తెలియదా?

కుహనా సెక్యూలర్ వాదులు ఎక్కడికి పోయారు?

తెలంగాణలో హిందువులకు గల్లా ఎగరేసుకుని చెప్పే పరిస్థితి రావాలా…? పచ్చ బిచ్చపు బతుకు కావాల్నా?

దేవుడుని ఎవరూ చూడలేదు… మరి దేవుడు ఉన్నాడా లేడా?

ఎవరికి భయపడే వ్యక్తిని కాను. ధర్మం కోసం మాత్రమే పని చేస్తాం

ధర్మం కోసం నక్సలైట్ల చేతిలో చనిపోయిన వ్యక్తులు బిజెపి వాళ్ళు

ఇవాళ మహబూబ్నగర్ లో ముఖ్యమంత్రి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదని కేసీఆర్ మాట్లాడుతాడు?

అసలు ఎవరు స్వేచ్ఛగా రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేదో ప్రజలకు తెలియదా?

కృష్ణా జలాల్లో తెలంగాణ కు హక్కుగా 575 టీఎంసీ లు రావలసి ఉండగా… 299 టీఎంసీ లకే సంతకం పెట్టి, మన వాటాకు గండి కొట్టిన ద్రోహి కేసీఆర్

కేంద్ర వైఖరి వల్ల తెలంగాణ నష్టపోయింది 40 వేల కోట్లు అని మొన్న అన్న కేసీఆర్ …ఇవాళ 3 లక్షల కోట్లు అంటున్నాడు

కెసిఆర్ కు తనమీద తనకే క్లారిటీ లేదు

కెసిఆర్ చెప్పేవన్ని అబద్ధాలే

1400 మంది పేదోళ్లు ఆత్మబలిదానం చేసుకుంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది

పేదోళ్లు చనిపోతే… పెద్దోడు రాజ్యమేలుతున్నాడు

మోడీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు

పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సుష్మ స్వరాజ్ మద్దతు తెలిపితేనే… ఈరోజు కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడు

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్ష, యాక్టింగ్ చేసిండు

తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలను చంకలో పెట్టుకుని తిరుగుతున్నాడు కేసీఆర్ అన్నారు.

తెలంగాణ లో రంగురంగుల జెండాలకు స్థానం లేదు

ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరిగితేనే… తెలంగాణ అభివృద్ధి చెందుతుంది

ముఖ్యమంత్రి గడీలను బద్దలు కొట్టే పార్టీ బీజేపీ పార్టీనే

కేసీఆర్ గడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధ విముక్తి రాలిని చేద్దాం

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తాం

నిలువ నీడలేని పేదలకు తప్పకుండా పక్కా ఇల్లు నిర్మిస్తాం

పంట నష్టపరిహారం కింద రైతులకు ‘ఫసల్ బీమా యోజన’ను పూర్తిగా అమలు చేస్తాం

ప్రజలకు అవసరమైన, మంచి జరిగే… ఏ పథకాన్ని బీజేపీ ఆపదు. ఇంకా మెరుగ్గా అమలు చేస్తాం

కెసిఆర్ కు కండకావరం తలకెక్కిందని,

కెసిఆర్ అహంకారాన్ని నేలకు దించుదామని పిలుపునిచ్చారు.

వచ్చేది బిజెపి ప్రభుత్వమేఅని ధీమా వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.