భారతదేశపు మొట్టమొదటి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లోప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారతదేశపు మొట్టమొదటి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇప్పుడు వినియోగదారులు తమ డెబిట్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఏటీఎం నుండి స్వచ్ఛమైన బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు.హైదరాబాద్లోని బేగంపేటలోని రఘుపతి ఛాంబర్స్లో తొలి గోల్డ్ ఏటీఎంను ప్రారంభించినట్లు సమాచారం. బంగారు ఏటీఎం కేంద్రాన్ని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు.వినియోగదారులు 0.5 గ్రాముల నుండి 100 గ్రాముల వరకు బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు వారి స్వచ్ఛత బరువును తెలిపే ధృవీకరణ పత్రాన్ని కూడా పొందుతారు. గోల్డ్ ఏటీఎంలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్లోని గుల్జార్హౌస్ సికింద్రాబాద్ అబిడ్స్తో పాటు పెద్దపల్లి కరీంనగర్ వరంగల్లో గోల్డ్ ఏటీఎంలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.డెబిట్ క్రెడిట్ కార్డులతో 0.5 12 51050100 గ్రాముల 24 క్యారెట్ల బంగారు నాణేలు డ్రా చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. కాగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఏటీఎం స్క్రీన్ పై కనిపిస్తాయి. మరోవైపు ఈ ఏటీంలను నగరంలోని పలు ప్రాంతాలతోపాటు వరంగల్ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల్లో కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.గృహిణిలకు తాము దాచుకున్న డబ్బులతో నిర్మొహమాటంగా ఏటీఎం వద్దకు వచ్చి బంగారాన్ని తీసుకోవచ్చని నిర్వాహకులు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.