జగ్గారెడ్డి థర్డ్ క్లాస్ మనిషి

- మండిపడ్డ షర్మిల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. జగ్గారెడ్డి థర్డ్ క్లాస్ మనిషి అని దుయ్యబట్టారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని తోచిపుచ్చారు. కొత్త రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందనితెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ తాలిబన్లలాగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కొడుకు ల్యాండ్ బ్యాంక్కూతురు లిక్కర్ బ్యాంక్కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు లో దోచుకున్నారని షర్మిల ఆరోపించారు.

తెలంగాణకు షర్మిల కోడలే తప్ప కూతురు కాదు: జగ్గారెడ్డి

తెలంగాణలో సమస్యలపై ఎవరూ ప్రశ్నించనట్లు షర్మిల ఓవరాక్షన్‌ చేస్తున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఎద్దేవాచేసిన విషయం తెలిసిందే. ‘‘ఏపీలో సీఎం మీ అన్నే కదా అక్కడ సమస్యలు లేవా?.. ఏపీలో సమస్యలపై షర్మిల ఎందుకు మాట్లాడటం లేదు?.. త్వరలోనే షర్మిల ఫైనాన్స్ వ్యవహారాలన్నీ బయటపెడతా. తెలంగాణకు షర్మిల కోడలే తప్ప కూతురు కాదు’’ అని జగ్గారెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.