వికారాబాద్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ ధర్నా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వికారాబాద్ కలెక్టరేట్ వద్ద రైతు సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నానిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెరాస పార్టీ ధరణి ప్రవేశపెట్టి రైతులకు ఇబ్బందులకు గురిచేస్తుందని, గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాల బాగుండేదన్నారు. వెంటనే ధరణిని రద్దు చేసి పాత పద్దతిని అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.