బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సోమవారం ఉదయం జిల్లాలోని వేమూరు మండలం జంపని వద్ద ఆటో బోల్తాపడింది. దీంతో నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతులు కృష్ణా జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.