బాన్సువాడలో బస్తీ దవాఖాన ప్రారంభం.
తెలంగాణ జ్యోతి/బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం లో బస్తీ దవాఖనను బుధవారం తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లోనూ వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం బస్తి దవాఖానాలను ఏర్పాటు చేస్తుందన్నారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఈ దవాఖానాలను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం స్థానిక వైద్యులతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జీతేశ్ వి పాటిల్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి , ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , RDO రాజాగౌడ్ ,తెరాస నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి , ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.