ఎమ్మెల్యేల కొనుగోలు అంశం లో కొత్త డ్రామాకు తెరలేపిన  రాష్ట్ర ప్రభుత్వం

- బీజేపీ నేత రామచంద్రరావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఎమ్మెల్యేల కొనుగోలు అంశం లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందని బీజేపీ నేత రామచంద్రరావు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే సీఎం కేసీఆర్ సిట్‌ను ఏర్పాటు చేశారని ఆరోపించారు. సిట్‌లో విచారణ ఉండదని.. తీర్పు కేసీఆర్ దగ్గరే ఉందని అన్నారు. సిట్ బయటపెట్టాల్సిన వివరాలను కేసీఆర్ బయటపెట్టడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్‌ను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. పోలీసులు విచారణ చేయకంటే ముందే కేసీఆర్ అన్ని విషయాలు బయట పెడుతున్నారన్నారు. కేసీఆర్ స్వయంగా ఫాంహౌస్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిపారు. ట్యాపింగ్ చేసే అధికారం సీఎం కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారని నిలదీశారు. కేసీఆర్ స్వయంగా కోర్టుకు వచ్చి అఫిడవిట్ ఇవ్వాలన్నారు. కొత్త భవనాలు, సెక్రెటరియట్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై సిట్ వేసి విచారణ జరగాలని అన్నారు. మోదీకి భయపడే సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేదని రామచంద్రరావు వ్యాఖ్యలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.