ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ తరలిన స్పీకర్ పోచారం
తెలంగాణ జ్యోతి/తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, TRS పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్రావ్ అధ్వర్యంలో హైదరాబాద్ లోని తెలంగాణభవన్ లో నిర్వహిస్తున్న తెరాస పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్ర శాసన సభపతి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి బాన్సువాడ నుండి హైదరాబాద్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. స్పీకర్ తో పాటు వారి తనయులు తెరాస పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు హైదరాబాద్ వెళ్లారు. అసెంబ్లీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొనడానికి కేసిఆర్ గారు ప్రత్యేక హెలికాప్టర్ ను ఏర్పాటు చేశారు.