నేడు కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం కేసీఆర్ (CM Kcr) అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నిన్న టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ ఇచ్చిన పత్రాలపై కేసీఆర్ (CM Kcr) సంతకం చేశారు. తెలంగాణ భవన్ లో BRS ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఈ క్రమంలో TRS BRS మారిన తరువాత మొదటి కేబినెట్ భేటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈనెలలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ (CM Kcr) నిర్ణయించారు. ఈ సమావేశంలో అసెంబ్లీలో ఎలాంటి ధోరణితో ముందుకెళ్లాలి. కేంద్రం వ్యతిరేక విధానాలను ప్రజలకు అసెంబ్లీ ద్వారా చెప్పాలని గులాబీ బాస్ యోచిస్తున్నారు. అలాగే రైతుబంధు నిధుల జమ, ధాన్యం కొనుగోళ్లు, దళిత బంధు, సొంత జాగా ఉండి ఇళ్లు కట్టుకునే అంశాలపై ప్రధాన చర్చ జరుగనుంది

Leave A Reply

Your email address will not be published.