నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూరు గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు విడిచారు. వారి వద్ద లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా మృతులు నందిపేట్ మండల కేంద్రానికి చెందిన వారుగా గుర్తించారు. తెలంగాణలో సుప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కొండగట్టుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన వారు నందిపేట్ మండలం సుభాష్నగర్కు చెందిన మంద మోహన్, ఉమ్మడి అశోక్, రమేష్గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా.. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.