13వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 13వ రోజు శనివారం బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర” దిగ్విజయంగా కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ఐలాపూర్ గ్రామంలో పాదయాత్ర కొనసాగుతుండగా ఐలాపూర్ గ్రామంలోని “సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్” విగ్రహానికి బండి పూలమాలవేసి, నివాళి అర్పించారు. అనంతరం గౌడ సోదరుల కోరిక మేరకు, కల్లు రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.