ఆర్టీసీ బస్సు ఢీకొని సర్పంచ్ మృతి

తెలంగాణజ్యోతి/ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది.భద్రాచలం డిపోకి చెందిన లగ్జరి భద్రాచలం నుండి హైదరాబాద్ వెళ్తున్న TS28 Z 0059 ఆర్టీసి బస్సు ఢీకోని కొణిజర్ల మండలం మేకులకుంట గ్రామ సర్పంచ్ గుగులోత్ నరసింహ అక్కడక్కడే మృతి చెందడం జరిగింది. దసరా పండగ సందర్భంగా బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలిపి ద్విచక్ర వాహనంపై ఖమ్మం నుండి సొంత గ్రామమైన మేకలకుంటకు ఇంటికి తిరిగి వస్తుండగా ఆయనను నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో నరసింహ అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Leave A Reply

Your email address will not be published.