కూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్
తెలంగాణ జ్యోతి/భారతదేశ పదాతిదళానికి చెందిన చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్లో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు.మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తవాంగ్ ప్రాంతంలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. రోజువారీ విధుల్లో భాగంగా చక్కర్లు కొడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సైనిక బృందాలు ఇరువురు పైలట్లను సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. వీరిలో ఒకరు లెఫ్టినెంట్ కర్నల్ సౌరభ్ యాదవ్ చికిత్స పొందుతూ మరణించినట్లు పేర్కొంది. మరొకరికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపింది. ప్రమాదానికి గల కారణాలను అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది.