ఐపీసీలో చేరిన ప్రముఖ సంఘ సేవకురాలు చిత్ర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ప్రజా కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ సంఘ సేవకురాలు చిత్ర  చేరారు.ఎన్నో సంవత్సరాలుగా వివిధ సంస్థల ఆధ్వర్యంలో ముఖ్యంగా మాతృదేవో భవ సత్సంగం లో ప్రముఖ  పాత్ర నిర్వహిస్తూ అన్నదాతగా పేరుపొందిన ప్రముఖ సంఘ సేవకురాలు చిత్ర ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీలో చేరారు హైదరాబాదులోని ఆల్వాల్ లోని వారి కార్యాలయంలో జరిగిన ఐపిసి కార్యక్రమంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ సమక్షం లో ఐపిసి లో చేరారు.ఈ సందర్బంగా ఐపీసీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ మాట్లాడుతూ చిత్ర లాంటి సంఘ సేవకులు ఐపిసి పార్టీలో చేరడం హర్షణీయమన్నారు. త్వరలోనే ఆమెకు ఐపీసీలో సముచిత స్థానం ఇస్తామన్నారు చిత్ర మాట్లాడుతూ ఐపిసి పార్టీకి తన వంతు సేవ చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఐపీసీ పంచ సూత్రాలైన మాతృ ప్రేమతో పరిపాలన ప్రతి మనిషికి విద్యా వైద్యం ఉచితం భారతదేశం మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం మతసామరస్యాన్ని పాటిస్తూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడం మానవసేవే మాధవసేవ అనగా ప్రతి కుటుంబము సుఖసంతోషాలతో జీవించడానికి ఐపీసీ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కోఆర్డినేటర్స్ రాజు సతీష్ కృష్ణ ఐపిసి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ కొండల్రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.