కన్నతల్లిని హతమార్చిన తనయుడు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వరంగల్లో దారుణ చోటు చేసుకుంది. కన్న తల్లిని రోకలిబండతో కుమారుడు కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన వరంగల్ లోని లెనిన్ కాలనీలో చోటు చేసుకుంది.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతో ఇద్దరు భార్య భర్తల మధ్య గొడవ తలెత్తింది. దీంతో వారు గొడవ పెట్టుకుంటున్న సమయంలో తల్లి అడ్డంగా వెళ్లింది.
దీంతో కుమారుడు కృష్ణ తల్లిని రోకలి బండతో తలపై గట్టిగా కొట్టాడు. తీవ్ర గాయం కావడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో నిందితుడు కృష్ణ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని నిందితున్ని పట్టుకుంటామని తెలిపారు.