విగ్రహ దాతకు కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం

తెలంగాణ జ్యోతి/ బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో యువజన దుర్గాభవాని మండప కమిటీ సభ్యులు గురువారం గత మూడు సంవత్సరాల నుండి భవానీ మాత విగ్రహాన్ని తన సొంత డబ్బులతో కొనుగోలు చేసి మండప కమిటీకి విరాళంగా ఇస్తున్న గ్రామానికి చెందిన ముత్యపు వార్ నరేష్-చందన దంపతులను శాలువా పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి అమ్మవారి విగ్రహాన్ని విరాళంగా అందించడమే కాకుండా యువజన దుర్గ భవాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నరేష్ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహించడం హర్షనీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భవాని మాత దీక్షా స్వాములు గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.