ఒకే అడ్రస్తో 170 ఓటర్ల నమోదు
- ఈసీకి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఫిర్యాదు
తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్/నెల్లూరు: తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కావలిలో అధికార వైసిపి పార్టీ అనర్హులను ఓటర్లుగా చేర్చిందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. నెల్లూరు జిల్లా కావాలిలో ఒకే అడ్రస్తో దాదాపు 170 ఓటర్లను నమోదు చేయించారని అన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. డిగ్రీ పూర్తయి 3 సంవత్సరాలు గడిచిన వారు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికలకు తమ ఓటు హక్కును నమోదు చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ఈసీ స్పందించకపోతే న్యాయపోరాటానికి సైతం వెనుకడబోమని స్పష్టం చేశారు.