హెలికాఫ్టర్ కొనుగోలు చేసిన వ్యాపారవేత్త

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/కరీంనగర్: కరీంనగర్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త ప్రైవేట్ హెలికాప్టర్ కొనుగోలు చేశారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిన్న హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రిలో ఓ ప్రైవేటు హెలికాప్టర్‌కు పూజలు నిర్వహిచటం ఇదే తొలిసారి. కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రతిమా ఇన్‌స్టిట్యూట్‌ మెడికల్‌ సైస్సెస్‌ ఎండీ, హైదరాబాద్‌ ఎయిర్‌ లైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ బోయిన్‌పల్లి శ్రీనివాసరావు ఈ చాపర్‌ను కొనుగోలు చేశారు.  యాదాద్రి పెద్దగుట్ట (ఆలయ నగరి)పై పూజారులు చాపర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో వ్యాపారవేత్త బోయిన్ పల్లి శ్రీనివాసరావుతో పాటు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పూజ అనంతరం శ్రీనివాస్‌రావు హెలికాప్టర్‌ను ఆన్ చేశారు. అనంతరం కాసేపు హెలికాప్టర్ గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ దృశ్యాలను యాదాద్రికి వచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకించారు.

Leave A Reply

Your email address will not be published.