కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/’బాన్సువాడ ప్రతినిధి:  బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో శనివారం కళ్యాణలక్ష్మి ,షాది ముబారక్ చెక్కులను కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ లు లబ్దిదారులకు పంపిణి చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదింటి అడబిడ్డల వివాహాం కోసం  1,00,116 చొప్పున ఆర్థిక సహాయం అందించే లక్ష్యం తో బాన్సువాడ అభివృద్ధి ప్రదాత, స్పీకర్ పొచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు 18 షాది ముబారక్, 2 కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎజాస్, పట్టణ మైనారిటీ సెక్రెటరీ యండి. దావూద్, షాదీఖానా చైర్మన్ వాహబ్, ఆర్.ఐ. అశోక్, మున్సిపల్ కౌన్సిలర్లు బాడీ శ్రీనివాస్, అహ్మద్, నార్ల నందకిశోర్, ఆమెర్, హకీం, మోతిలాల్, నాయకులు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.