ఆర్యవైశ్య మహిళా సంఘం అద్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు

తెలంగాణ జ్యోతి/బాన్స్ వాడ: బాన్స్ వాడ పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరంలో దుర్గానవరాత్రుల ఉత్సవాలను గత పదకొండు రోజులుగా నవ దుర్గల అవతారాలలో సుందరంగా అలంకరణ చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. గురువారం దుర్గ నవరాత్రులు ముగింపు సందర్బంగా అమ్మవారికి డోలారోహణ నిర్వహించి 11రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారికి సమర్పించిన చీరలు,పండ్లు,నోట్ల దండలు, ప్రసాదాలు వేలం నిర్వహించి భక్తులకు అందజేశారు. ప్రతీ రోజు అమ్మవారి ప్రసాదంగా అల్పాహారం, అన్నదానం సమర్పించిన ధాతలకు ఆర్య వైశ్య మహిళా సంఘము ప్రతినిధులు సన్మానకార్యక్రమాన్ని చేపట్టారు. సాయంత్రం అమ్మవారి పల్లకి సేవలో బాన్స్ వాడ పట్టణ పురవీధుల్లో మంగళ హారతులతో మహిళలు కోలాటంతో శోభాయమానంగా శోభా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య పట్టణ సంఘము యువజన, మహిళా, సంఘాల కమిటీ సభ్యులు, మహిళలు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.