నేడు క్రిస్టియన్లకు దుస్తులు పంపిణీ చేయనున్న మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్ ప్రతినిధి: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు క్రిస్మస్ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన నూతన దుస్తులను క్రిస్టియన్లకు పంపిణీ చేయనున్నారు.
1. ఉదయం 10 గంటలకు పాలకుర్తి నియోజకవర్గం, రాయపర్తిలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ.
2. ఉదయం 11.30 గంటలకు పాలకుర్తి నియోజకవర్గం, కొడకండ్ల మండలం, మొండ్రాయి గ్రామంలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ.
3. మధ్యాహ్నం 12.30 గంటలకు పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల అక్షర గార్డెన్స్ లో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ.
4. మధ్యాహ్నం 1.30 గంటలకు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ.