అక్రమ నిర్మాణాలు ఆపాలంటూ నాగార్జునకు నోటీసులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టాలీవుడ్ హీరో నాగార్జునకు షాక్ తగిలింది. గోవాలో మాండ్రేమ్ పంచాయతీ సర్పంచ్ ఆయనకు నోటీసులు జారీ చేశారు. ‘అక్రమ’ నిర్మాణాలను ఆపకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునకు గోవాలోని మాండ్రేమ్ పంచాయతీ సర్పంచ్ నోటీసులు జారీ చేశారు. గ్రామంలో నాగార్జునకు సంబంధించిన నిర్మాణ పనులను ఆపాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

“మాండ్రేమ్ పంచాయతీ సర్వే నెం.211/2బి ప్రాంతంలో ముందస్తు అనుమతి లేకుండా మీకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయి. వెంటనే పనులు ఆపకపోతే పంచాయతీ రాజ్ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకుంటాం” అని మాండ్రేమ్ సర్పంజ్ అమిత్ సావంత్.. నాగార్జునకు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.