కోవిడ్ పేరుతో రాహుల్ పాదయాత్రకి బీజేపీ చెక్ ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పాదయాత్రతో వస్తున్న మైలేజీని చూసి బీజేపీ తట్టుకోలేకపోతోంది. ఎలాగైనా సరే రాహుల్ పాదయాత్రను ఆపేయాలని డిసైడ్ అయ్యింది. కన్యాకుమారి నుంచి మొదలైన రాహుల్ పాదం ఇప్పుడు రాజస్థాన్ దాటి ఢిల్లీకి చేరువైంది.  కశ్మీర్ వరకూ సాగనుంది.అయితే ఎవ్వరూ ఊహించని విధంగా రాహుల్ పాదయాత్రకు మద్దతు లభిస్తోంది. సినీ రాజకీయ ఆర్థిక నిపుణులు సైతం రాహుల్ పాదయాత్రకు వచ్చి ఆయనతో పాదం కలిపి సపోర్ట్ చేస్తున్నారు. దక్షిణాదిన ప్రముఖ హీరోయిన్లు కొందరు సామాజిక కారులు రాహుల్ పాదయాత్రకు సపోర్టుగా ఆయనతో కలిసి నడిచారు.ఇక రాజస్థాన్ లో దేశంలోనే ప్రముఖ ఆర్థిక నిపుణుడు మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ స్వయంగా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొని నడిచారు. మోడీ సర్కార్ ఆర్థిక విధానాలను ఆయన తూర్పారపట్టారు.ఇక ఢిల్లీలో రాహుల్ గాంధీ పాదయాత్రలో దేశంలోని దిగ్గజాలు అంతా పాల్గొనాలని చూస్తున్నారు. రాష్ట్రాల నుంచి కీలక నేతలంతా ఢిల్లీ వెళుతున్నారు. ఇలాంటి సమయంలో వచ్చే మైలేజ్ రాహుల్ కు కాంగ్రెస్ కు మేలు చేస్తుందని గ్రహించిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు కుట్ర పన్నుతోంది. ఎలాగైనా సరే కాంగ్రెస్ కు రాహుల్ కు మైలేజ్ దక్కకుండా చేస్తోంది.అందుకే సడెన్ గా కోవిడ్ నిబంధనలు తెరపైకి తెచ్చింది. చైనా పాకిస్తాన్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర అప్రమత్తమైంది. పలు కీలక సూచనలు చేసింది. ఎక్కువమంది గుమికాకుండా నిబంధనలు తీసుకొచ్చింది. ఇది పాదయాత్ర చేసే రాహుల్ కు శరాఘాతంగా మారింది.కరోనా పేరు చెప్పి రాహుల్ గాంధీ పాదయాత్రకి చెక్ పెట్టాలని కేంద్రం భావించినట్టు ఉంది. ఇప్పటిదాకా గుర్తుకురాని కరోనా తీవ్రత.. నిబంధనలు ఇప్పుడు రాహుల్ పాదయాత్ర సమయంలోనే తెరపైకి తేవడం వెనుక అసలు కారణం ఇదేనంటున్నారు. రాహుల్ పాదయాత్రకు ఇలా అడ్డుకట్ట వేసే ఎత్తుగడగా భావిస్తున్నారు. తమ అధికార ప్రవాహానికి అడ్డుగా నిలబడుతున్న రాహుల్ పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని.. మామూలుగా అడ్డుకుంటే వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే ఈ కుట్ర చేసినట్టు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.