ర‌ద్దీగా ఉండే ప్ర‌దేశాల్లో ప్ర‌జ‌లు మాస్క్‌ లు ధ‌రించాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ర‌ద్దీగా ఉండే ప్ర‌దేశాల్లో ప్ర‌జ‌లు మాస్క్‌ లు ధ‌రించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం సూచ‌న చేసింది. చైనాలో మ‌ళ్లీ కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ ప్ర‌క‌ట‌న చేసింది. కోవిడ్ క‌ల‌క‌లం నేప‌థ్యంలో ఇవాళ కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ ఉన్న‌త అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. మీటింగ్ త‌ర్వాత మంత్రి ట్వీట్ చేశారు. కోవిడ్ ఇంకా ముగిసిపోలేద‌ని, అంద‌రూ అల‌ర్ట్‌గా ఉండాల‌ని, నిఘా పెంచాల‌ని ఆదేశించిన‌ట్లు మంత్రి తెలిపారు. ఎటువంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. మంత్రి మాండ‌వీయ మీటింగ్‌లో పాల్గొన్న అధికారులు అంద‌రూ మాస్క్‌లు ధ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.