పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హన్మకొండ: గొప్ప నిజాయితీ గల నాయకుడు పివికి నివాళులర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. పి.వి నరసింహ రావు  వర్ధంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ జిల్లాలోని పివీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. పివీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు దేశం చాలా ముందుకెళ్లిందనీ, చాలా నిజాయితీగా పనిచేసిన నాయకుడుగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఇంతటి గొప్ప వ్యక్తి వరంగల్ బిడ్డ కావడం, తెలంగాణ వాడు కావడం, తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ప్రధానిగా ఎలా ఉండాలి? ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలి? అని నిరూపించిన మహానుభావుడు పీవీ నరసింహారావు గారు అన్నారు. అంత గొప్ప వ్యక్తికి నివాళులు అర్పించడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.