పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన శాసనసభాపతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ /నసురుల్లాబాద్: బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలల్లో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ గోదాం,గ్రామ పంచాయతీ నూతన భవనం, ముదిరాజ్ సంఘం భవనం,ఎస్సీ కమ్యూనిటీ హాల్,డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. స్పీకర్ వెంట ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొనగా ఆయనకు స్థానిక నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నసురుల్లబాద్ మండలం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,ప్రజలు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.