గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన స్పీకర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూరు మండల కేంద్రంలో మహాత్మా జ్యోతీభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల (MJPTBCWREIS), (BC రెసిడెన్షియల్ స్కూల్ -బాలుర) ను శనివారం రాత్రి విద్యార్థుల భోజన సమయంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను పరిశీలించి మేను ప్రకారం పప్పు దినుసులు, మసాలాలను వంటలలో వాడి నాణ్యమైన, రుచికరమైన భోజనం వండారా అని వార్డెన్, సిబ్బందిని ప్రశ్నించిన పోచారం

అన్నం, కూరలు రుచిగా ఉన్నాయా, సరిపోయేంత పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

నాణ్యమైన సరుకులు, కూరగాయలను కొనుగోలు చేసి రుచికరమైన ఆహారాన్ని వండాలి. మేను ప్రకారం ఆహార పదార్థాలు అందించాలని స్పీకర్ పోచారం గారు వార్డెన్, సిబ్బందికి సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న స్కూల్ భవనం త్వరలోనే పూర్తవుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.