రూ.33కోట్ల ఏయూఎంను అధిగమించిన ఎన్బిఎఫ్సి శ్రీరామ్ ఫైనాన్స్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కలిపి కంపెనీ ఏయూఎం రూ.33,000 కోట్లను చేరుకున్నట్లుగా భారతదేశంలోని అతిపెద్ద రిటైల్ ఎన్¬బిఎఫ్¬సి అయిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (శ్రీ రామ్ ఫైనాన్స్) నేడిక్కడ ప్రకటించింది. ఆర్థిక వృద్ధి, గ్రామీణ మార్కెట్ల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల నేపథ్యంలో ఈ వృద్ధి చోటు చేసుకుంది. ఇది వాణిజ్య వాహనాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ద్విచక్ర వాహనాల ఫైనాన్సింగ్ కోసం డిమాండ్ను పెంచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా లలో శ్రీరామ్ ఫైనాన్స్ తన 498 శాఖలు, 10,000 మంది ఉద్యోగుల ద్వారా 13,50,000 మంది కస్టమర్ల విభిన్న ఆర్థిక అవసరాలను తీరుస్తోంది. కంపెనీ ఈ రెండు రాష్ట్రాలలో 46,000 కంటే ఎక్కువ డిపాజిటర్లతో మొత్తం రూ.2930 కోట్ల దాకా భారీ స్థాయిలో ఫిక్స్¬డ్ డిపాజిట్ ఫ్రాంచైజీని కలిగి ఉంది. స్వయం ఉపాధి, ఎం ఎస్ఎంఈ ఆర్థిక వ్యవస్థను నడిపించడంపై కంపెనీ వృద్ధి వ్యూహం దృష్టి సారించింది. వాణిజ్య వాహనాల్లో అతిపెద్ద ఫైనాన్షియర్ అయిన శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ, అతి పెద్ద ద్విచక్ర వాహన ఫైనాన్సర్, సూక్ష్మ, చిన్న, మధ్