లోక్‌సభ సాక్షిగా జగన్‌ ప్రభుత్వ అసమర్థత మరోసారి బట్టబయలైంది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ఆంధ్రప్రదేశ్: లోక్‌సభ సాక్షిగా జగన్‌ ప్రభుత్వ అసమర్థత మరోసారి బట్టబయలైందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీలో ప్రతి రైతుపై రూ.2.45 లక్షల అప్పు ఉందన్న కేంద్రమంత్రి సమాధానంపై సీఎం జగన్‌ ఏం చెబుతారు? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. జాతీయ సగటు కంటే ఏపీ రైతులపై ఉన్న అప్పు మూడింతలు అని సోమిరెడ్డి అన్నారు. అప్పులు, రైతు ఆత్మహత్యలు, నేరాల్లో ఏపీని జగన్‌ నెం.1 చేశారని సోమిరెడ్డి విమర్శించారు. ఏపీ ప్రభుత్వం రూ.2 వేల కోట్ల విలువైన 5.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించిందని కేంద్రమంత్రే చెప్పారని సోమిరెడ్డి గుర్తు చేశారు. పేదల బియ్యాన్ని కేజీకి రూ.40 చొప్పున విదేశాలకు ఎగుమతి చేయడమేనా జగన్‌ సంక్షేమం? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. బియ్యం అక్రమ తరలింపు ద్వారా రూ.4 వేల కోట్లు దోచేశారని సోమిరెడ్డి ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.