ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- రెండు బైక్లు ఢీకొని ముగ్గురు మృతి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ఆదిలాబాద్ ప్రతినిది: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. తాంసి మండలం హస్నాపూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. రెండు బైక్లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మరో మరో ఇద్దరికి గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చిన్నారి సహా మొత్తం ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతులు మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.